
గౌరవెల్లి భూ నిర్వాసితులపై పోలీసులు అర్థరాత్రి అరాచకానికి పాల్పడ్డారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. అర్థరాత్రి వెళ్లి భూ నిర్వాసితులపై దాడి చేయాల్సిన అవసరమేముందో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. సీఎం అర్థరాత్రి ఫామ్ హౌస్ నుంచి పాలించడం మానుకోవాలన్నారు. మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఫైర్ అయ్యారు. ఇండ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేయడం అన్యాయమన్నారు. వెంటనే గౌరవెల్లి నిర్వాసితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగబోదని బండి సంజయ్ అన్నారు.
గౌరవెల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితుల పై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 13, 2022
ఇల్లు భూములు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి కాలయాపన చేయడం అన్యాయం.
భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు బిజెపి పోరాటం ఆగదు. pic.twitter.com/vLCwaol7R3
తీవ్ర ఉద్రిక్తతల మధ్య గౌరవెల్లి భూ నిర్వాసితుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు- ప్రొక్లైయినర్లు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులు- భూనిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణలో నిర్వాసితులను పోలీసులు చితకొడ్తున్నారు. లాఠీ చార్జ్ తో నిర్వాసితుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లాఠీ దెబ్బలను సైతం తట్టుకోని హుస్నాబాద్ RDO ఆఫీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నిర్వాసితుల్ని ఎక్కడికక్కడ అడ్డుకోని అరెస్ట్ చేస్తున్నారు. దీంతో హుస్నాబాద్ టౌన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గౌరవెల్లి భూ నిర్వాహితుల ర్యాలీని అడ్డుకోవటంపై మండిపడుతున్నారు.