
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ సారథి మష్రఫే మొర్తజా కరోనా బారిన పడ్డాడు. గత కొన్నిరోజులుగా మొర్తజా అస్వస్థతతో బాధపడుతుండడంతో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని రావడంతో తన నివాసంలోనే క్వారంటైన్ లో ఉన్నాడు. దీనిపై మొర్తజా తమ్ముడు మొర్సాలిన్ బిన్ మొర్తజా మాట్లాడుతూ, తన సోదరుడు రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఢాకాలోని తమ నివాసంలోనే ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడని తెలిపాడు. శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించగా, శనివారం పాజిటివ్ గా ఫలితం వచ్చిందని డాక్టర్లు వెల్లడించారన్నాడు.