బంజారా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయండి

బంజారా జాతీయ కమిషన్ ఏర్పాటు చేయండి
  •      బంజారా సేవాలాల్ సమితి డిమాండ్ 

సోమాజిగూడ, వెలుగు :  బంజారా జాతిపై పరిశోధన చేసి వారి అభివృద్ధికి జాతీయ బంజారా కమిషన్ ఏర్పాటు చేయాలని దక్షిణ భారత, మహారాష్ట్ర , మధ్య భారత్ బంజారా సేవాలాల్ సమితి డిమాండ్ చేసింది. బంజారాలకు రాజకీయ అధికారం ఇవ్వాలని కోరింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సమితి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించగా మాజీ మంత్రి రవీంద్రనాయక్ ప్రారంభించారు. ఇందులో డీబీఎంబీఎస్ఎస్ జాతీయ కన్వీనర్ భరత్ జి. రవినాయక్, ఈబీసీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు.

ALSO READ:  ఆసియా గేమ్స్‌‌‌‌లో కాంపిటీషన్‌‌‌‌ టఫ్‌‌‌‌ : సాత్విక్‌‌‌‌ సాయిరాజ్‌‌‌‌

తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, గోవా, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో బంజారాలు ఓబీసీలుగా ఉన్నారని,  ప్రత్యేక కేటగిరి కింద సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు, పథకాలు చేపడుతూ.. వారిని ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. హైదరాబాద్​లోని బంజరాహిల్స్ లో సేవాలాల్, జగదాంబ భవ్య మందిరాలను నిర్మించి,10 ఎకరాల స్థలంలో బంజారా రీసెర్చ్ డెవలప్ మెంట్ సెంటర్ ను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.