బ్యాంకు క్యాషియర్ కు కరోనా.. మరి ఖాతాదారుల సంగతేంటో..

బ్యాంకు క్యాషియర్ కు కరోనా.. మరి ఖాతాదారుల సంగతేంటో..

బ్యాంకు సిబ్బందికి కరోనా సోకిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికంటలో జరిగింది. స్థానికంగా ఉన్న యూనియన్ బ్యాంకు మేనేజర్ తో పాటు, బ్యాంక్ క్యాషియర్ కు కూడా కరోనా సోకింది. క్యాషియర్ కు కరోనా సోకడంతో అతని భార్యకు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేనేజర్ కు రెండు రోజుల క్రితమే కరోనా పాజిటివ్ గా వచ్చింది. అతని నుంచి క్యాషియర్ కు సోకినట్లు అధికారులు భావిస్తున్నారు. చికిత్స నిమిత్తం వారందరిని ఐసోలేషన్ సెంటర్ కు తరలిస్తున్నారు. కాగా.. బ్యాంక్ సిబ్బందికి కరోనా సోకడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బ్యాంకులో రెండు, మూడు రోజుల నుంచి లావాదేవీలు జరిపిన ఖాతాదారుల గురించి అధికారులు ఆరా తీస్తున్నారు.

For More News..

ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యాలయంలో కరోనా పాజిటివ్

వచ్చే వారం ఈటెల రాజేందర్ మంత్రి పదవి ఊడుతుంది

ఇంట్లో పిడుగుపడి అయిదుగురు మృతి.. అందులో నలుగురు పిల్లలే