అర్ధరాత్రి శ్రీకాళహస్తిలో బ్యాంకు దోపిడి

 అర్ధరాత్రి శ్రీకాళహస్తిలో బ్యాంకు దోపిడి

ఏపీ శ్రీకాళహస్తి పట్టణంలో పిన్ కేర్ బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. గురువారం రాత్రి 11 గంటల టైంలో మేనేజర్ ఆడిటింగ్ చేసుకుంటుండగా బ్యాంక్ లోకి చొరబడ్డారు దొంగలు. లాకర్ల నుంచి 85 లక్షల విలువ చేసే నగలు, 5 లక్షల రూపాయలు ఎత్తుకెళ్తారు. బ్యాంక్ లో దొంగతనంకు సంబంధించి కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే సీసీ కెమెరా రికార్డులను కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్ 30న అనకాపల్లిలో గ్రామీణ బ్యాంకులో కూడా దోపిడి జరిగింది. తుపాకీతో క్యాషియర్ ను బెదిరించిన దుండగుడు మూడున్నర లక్షల నగదును ఎత్తుకెళ్లాడు.

మరిన్ని వార్తల కోసం

అప్పులయ్యాయని రాజ్​భవన్​కు లెటర్​

పెంపుడు కుక్కతో వాకింగ్​ కోసం స్టేడియం ఖాళీ