
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే వైట్ బాల్ సిరీస్ సవాలుకు టీమిండియా సిద్ధమవుతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా సిరీస్ కు భారత జట్టు బుధవారం (అక్టోబర్ 15) ఆస్ట్రేలియాకు బయలుదేరింది. బుధవారం (అక్టోబర్ 19) ఉదయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి టీమిండియా మొదటి బ్యాచ్ చేరుకుంది. భారత ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ ఎయిర్ పోర్ట్ దగ్గర గుంపులుగా వచ్చారు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు ఇతర కోచింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రం బయలుదేరనున్నారు.
విమాశ్రమానికి చేరుకోవడానికి ముందు భారత ఆటగాళ్లు బస్సు ఎక్కుతున్న జట్టు వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. ఈ వీడియోలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. రోహిత్ కంటే ముందే కోహ్లీ బస్ లో కూర్చుకున్నాడు. బస్ ఎక్కే ముందు కోహ్లీని చూస్తూ రోహిత్ తన స్పెషల్ గా నమస్కారం చేశాడు. బస్ లోపలి వెళ్లిన తర్వాత హగ్ ఇచ్చాడు. అంతకముందు టీమిండియా నయా కెప్టెన్ శుభమాన్ గిల్ ను రోహిత్ హగ్ చేసుకున్నాడు. ఈ వీడియోలో రోహిత్ సహచర ప్లేయర్లతో కలిసిపోయిన విధానం ముచ్చటగొలిపే విధంగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో బీసీసీఐ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
రెండు బ్యాచ్ లుగా టీమిండియా ఆసీస్ లో అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా మొదటి బ్యాచ్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.
టీమిండియా వెళ్లబోయే తొలి బ్యాచ్ లో విరాట్ కోహ్లీ ముందు వరుసలో కనిపించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, నయా కెప్టెన్ శుభ్మాన్ గిల్, హర్షిత్ రాణా, శ్రేయాస్ అయ్యర్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. రెండు బ్యాచ్లలో ఆటగాళ్లను పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. రెండో బ్యాచ్ ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం బయలుదేరే అవకాశం ఉంది. కోహ్లీ, రోహిత్ శర్మ ఏడు నెలల తర్వాత గ్రౌండ్ లో కనిపించనుండడంతో ఈ సిరీస్ కు వీరిద్దరూ ప్రధాన ఆకర్షణగా మారనున్నారు.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో సిరీస్:
2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత వన్డే జట్టు :
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ , హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ధృవ్ జురెల్, యశస్వి జైశ్వాల్
𝙀𝙣 𝙧𝙤𝙪𝙩𝙚 𝘿𝙤𝙬𝙣 𝙐𝙣𝙙𝙚𝙧 ✈️
— BCCI (@BCCI) October 15, 2025
Of familiar faces and special reunions as #TeamIndia depart for the Australia challenge 😍#AUSvIND pic.twitter.com/ElV3OtV3Lj