- తలసాని శ్రీనివాస్ యాదవ్
పద్మారావునగర్, వెలుగు: ఓటరు జాబితా సవరణలో భాగంగా మే 1 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇంటింటి సర్వే పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్ ఆఫీస్లో సనత్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సర్వేపై దేశవ్యాప్తంగా పలు అనుమానాలు ఉన్నందున, అధికారులు వివరాలు సేకరించే సమయంలో ఏజెంట్లు సమన్వయం చేసుకోవాలని కోరారు. ప్రతి బూత్కు స్థానిక ఓటర్లపై అవగాహన ఉన్న ఒక ఏజెంట్ను నియమించాలని, అలాగే 18 ఏళ్లు నిండిన వారందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నిర్లక్ష్యం వహిస్తే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులను హెచ్చరించారు.

