హైదరాబాద్ మియాపూర్లోని ఈ ఏరియా వైపు నైట్ టైం వెళ్లేటోళ్లు జాగ్రత్త..!

హైదరాబాద్ మియాపూర్లోని ఈ ఏరియా వైపు నైట్ టైం వెళ్లేటోళ్లు జాగ్రత్త..!

మియాపూర్, వెలుగు: దారిదోపిడీ కేసులో నలుగురిని అరెస్ట్​చేసినట్లు పోలీసులు తెలిపారు. మియాపూర్ ప్రేమ్ నగర్ ఎ బ్లాక్ కు చెందిన ఎండీ.ఖాసీం బి బ్లాక్లోని గ్లాస్ షాప్లో వర్క్ చేస్తున్నాడు. ఈ నెల 7న రాత్రి 11 గంటలకు పని ముగించుకొని, బైక్పై ఇంటికి వెళ్తున్నాడు.

బి బ్లాక్ శ్మశానవాటిక గ్రౌండ్ వద్ద నలుగురు యువకులు అతన్ని అడ్డుకొని, మొబైల్, జేబులోని రూ.400 లాక్కున్నారు. ఖాసీం సోదరుడికి స్కానర్ పంపించి, ఒకసారి రూ.15 వేలు, మరోసారి రూ.2 వేలు తీసుకొని, వదిలేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. నిందితులు, ప్రేమ్ నగర్ ఎ బ్లాక్కు చెందిన సయ్యద్ షబ్బీర్, అఫ్రోజ్ అలీఖాన్, హస్సేన్, హర్ఫత్ను మంగళవారం అరెస్ట్ చేశారు.