ఔరంగాబాద్ : బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గొడ్డు మాంసం కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది. హస్పురాలోని బాలాబిఘాలోని హనుమాన్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డు మాంసం ఉంచారని పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయాన్ని శుభ్రం చేసి శానిటైజ్ చేయించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు సంఘ వ్యతిరేకులు చేసిన చర్య అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికులతో సమావేశం నిర్వహించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి సంఘ వ్యతిరేక వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటా మన్నారు. ప్రజలు సంయమనంగా ఉండాలని కోరారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో ఎలాంటి మత ఘర్షణలు తలెత్తకుండా పోలీసు బలగాలను మోహరించారు.