హెలికాప్టర్‌లో జారిపడ్డ మమత

హెలికాప్టర్‌లో జారిపడ్డ మమత

కోల్ కతా:  బెంగాల్‌‌‌‌‌‌‌‌‌‌ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా హెలికాప్టర్‌‌‌‌లో జారి పడ్డారు. దీంతో దీదీకి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం మధ్యాహ్నం పశ్చిమ బర్ధమాన్‌‌‌‌ జిల్లాలోని దుర్గాపుర్‌‌‌‌ నుంచి అసన్‌‌‌‌సోల్‌‌‌‌ వెళ్లేందుకు హెలికాప్టర్‌‌‌‌ ఎక్కారు. లోపల సీట్లో కూర్చునే క్రమంలో ఆమె బ్యాలెన్స్‌‌‌‌ కోల్పోయి కిందపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే సాయమందించారు.  మమత ఆరోగ్యకరంగానే ఉన్నారని సీఎంవో ప్రకటించింది. ఆ తర్వాత తన ఎన్నికల ప్రచారాన్ని దీదీ కొనసాగించారు. అసన్ సోల్ పార్టీ అభ్యర్థి శత్రఘ్న సిన్హా కోసం ప్రచారం నిర్వహించారు.