కోల్కతా : తమ ప్రభుత్వానికి వ్యతిరే కంగా బీజేపీ నేతలు మంగళవారం నిర్వహించిన చలో సెక్రటేరియట్పై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. నిరసన ర్యాలీకి ఆ పార్టీ నేతలు వేరే రాష్ట్రాల నుంచి రౌడీలను తెప్పించార ని, వారికి బాంబులు, గన్స్ ఇచ్చారని ఆమె ఆరోపించారు. బుధవారం మీడియాతో ఆమె మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలు హింసకు పాల్పడినా, పోలీసులపై దాడిచేసినా పోలీసులు లాఠీచార్జ్ చేయలేదనిచెప్పారు. ‘‘బీజేపీ ర్యాలీ సందర్భంగాచాలామంది పోలీసులు గాయపడ్డారు. పోలీసుల పై దాడిచేసిన వారిని, ప్రభుత్వ వెహికల్స్ను తగులబెట్టిన వారిని చట్టం వదలదు. ప్రశాంతంగా నిరసన తెలియజేస్తే ఇబ్బంది లేదు. కానీ రౌడీయిజం చేస్తామంటే సహించం” అని మమత హెచ్చరించారు.
