బెంగళూరు హోటల్స్ వండి వడ్డిస్తోంది కుక్క మాంసమా..? సడన్గా ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే..

బెంగళూరు హోటల్స్ వండి వడ్డిస్తోంది కుక్క మాంసమా..? సడన్గా ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే..

బెంగళూరు: బెంగళూరులోని కేఎస్ఆర్ రైల్వే స్టేషన్లో 150 కార్టన్ల రెడ్మీట్ను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసినట్లు బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు తెలిపారు. రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చిన ట్రైన్లో ఈ రెడ్ మీట్ కలకలం రేగింది. మేక లేదా గొర్రె మాంసం అని తొలుత భావించినప్పటికీ కుక్క మాంసం అయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. 

ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఈ రెడ్మీట్ శాంపిల్స్ను సేకరించి టెస్టింగ్కు పంపారు. 150 బల్కీ కార్టన్లలో 3 వేల కిలోల పరిమాణం ఉన్న ఈ రెడ్మీట్ జైపూర్-మైసూర్ ఎక్స్ప్రెస్లో పార్సిల్ వ్యాన్(VPU)లో కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్కు చేరుకుంది. ప్లాట్ఫాం నంబర్ 5కి శుక్రవారం సాయంత్రం 3.21 నిమిషాలకు ట్రైన్ చేరుకుంది. పార్శిల్ వ్యాన్ అబ్దుల్ రజాక్ అనే మాంసం వ్యాపారి పేరు మీద లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. సాయంత్రం 5.20 నిమిషాలకు రైల్వే స్టేషన్ నుంచి ఈ మాంసం తరలిస్తుండగా సీజ్ చేశారు.

ఈ వ్యవహారంపై మాంసం వ్యాపారి అబ్దుల్ రజాక్ స్పందిస్తూ.. గత 12 ఏళ్లుగా మాంసం వ్యాపారం చేస్తున్నామని, అంతా లీగల్ విధానంలోనే ఉందని.. ఐస్ బాక్స్లో మాంసం ఉంచినట్లు తెలిపాడు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, బీబీఎంపీ లైసెన్స్ కూడా ఉందని రాజస్థాన్ నుంచి ఈ రెడ్ మీట్ తెప్పించిన అబ్దుల్ రజాక్ చెప్పాడు. జైపూర్ నుంచి తమకు మీట్ వస్తుందని, క్వాలిటీపై అనుమానాలతోనే అధికారులు మీట్ శాంపిల్స్ను టెస్ట్కు పంపారని చెప్పారు. కుక్క మాంసం అయి ఉండొచ్చనే ప్రచారాన్ని అబ్దుల్ రజాక్ కొట్టిపారేశాడు. ఇక్కడ.. ఇల్లీగల్ బిజినెస్ ఏం చేయడం లేదని, ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రతీ విషయాన్ని పూసగుచ్చినట్టు వివరిస్తానని తెలిపాడు. ప్రస్తుతం ఆ మీట్ ను కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంచారు. ఈ మీట్ శాంపిల్స్కు సంబంధించిన రిపోర్ట్ 14 రోజుల్లో రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

హిందుత్వ యాక్టివిస్ట్ పునీత్ కేరేహళ్లి కొందరు హిందుత్వ యాక్టివిస్టులతో కలిసి రైల్వే స్టేషన్కు వెళ్లి ఆ మాంసంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. అది కచ్చితంగా కుక్క మాంసమేనని, రోజుకు ఆరు టన్నుల మాంసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారని కేరేహళ్లి చెప్పారు. ఈ కుక్క మాంసాన్ని మటన్తో కలిపి అమ్మేస్తు్న్నారని ఆరోపించారు. 75 నుంచి 80 గంటల పాటు నిల్వ ఉంచి, పాడై పోయిన మాంసం అని.. ఫ్రెష్గా కనిపించడం కోసం వెనిగర్ చల్లుతారని కేరేహళ్లి చెప్పారు. 

రిజ్వాన్ ఖురేషి అనే మాంసం వ్యాపారి కూడా ఈ రెడ్మీట్పై అనుమానాలు వ్యక్తం చేయడం కొసమెరుపు. కొన్ని రోజుల క్రితమే ఈ వ్యవహారంలో బీబీఎంపీ కమిషనర్, పోలీసులకు ఫిర్యాదులు అందాయని.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఖురేషి చెప్పాడు. హోటల్స్కు ఈ నిల్వ ఉంచిన మాంసాన్ని సప్లై చేస్తున్నారని.. నాన్ వెజ్ తినే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని.. ఇది కుక్క మాంసమా కాదా అనేది ల్యాబ్ టెస్ట్లో తేలిపోనుందని తెలిపాడు.