ముథోల్ అభివృద్ధికి కృషి చేయండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరిన ఎమ్మెల్యే రామారావు పటేల్

ముథోల్ అభివృద్ధికి కృషి చేయండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరిన ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, వెలుగు: ముథోల్​ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్​ వెంకటస్వామిని ఎమ్మెల్యే రామారావు పటేల్​ కోరారు. శనివారం హైదరాబాద్​లో మంత్రులు వివేక్​తో పాటు అడ్లూరి లక్ష్మణ్​ను సిర్పూర్​ ఎమ్మెల్యే హరీశ్​ బాబుతో వెళ్లి కలిశారు. ఇటీవల కొత్తగా మంత్రివర్గంలో చేరి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి బొకేలు అందజేసి సన్మానించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ముథోల్ ​నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వారి వెంట స్థానిక లీడర్లున్నారు. 

మంత్రి వివేక్​ను కలిసిన నల్లాల ఓదెలు

కోల్​బెల్ట్, వెలుగు: మంత్రి గడ్డం వివేక్​ వెంకటస్వామిని హైదరాబాద్​లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కలిశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్​కు బొకే అందజేసి విషెస్​ తెలిపారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కోలుకున్న ఓదెలు యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఓదెలు కోలుకున్నారని, ప్రజాక్షేత్రంలోకి తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. కాంగ్రెస్ అండదండలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ఓదెలు వెంట ఆయన చిన్న కొడుకు సన్నీ ఉన్నారు.