
భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని కార్మిక, మైనింగ్ శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామిని ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. శనివారం హైదరాబాద్లో మంత్రులు వివేక్తో పాటు అడ్లూరి లక్ష్మణ్ను సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబుతో వెళ్లి కలిశారు. ఇటీవల కొత్తగా మంత్రివర్గంలో చేరి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారికి బొకేలు అందజేసి సన్మానించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ముథోల్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని, పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి పాటు పడాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వారి వెంట స్థానిక లీడర్లున్నారు.
మంత్రి వివేక్ను కలిసిన నల్లాల ఓదెలు
కోల్బెల్ట్, వెలుగు: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కలిశారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వివేక్కు బొకే అందజేసి విషెస్ తెలిపారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కోలుకున్న ఓదెలు యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఓదెలు కోలుకున్నారని, ప్రజాక్షేత్రంలోకి తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు. కాంగ్రెస్ అండదండలు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. ఓదెలు వెంట ఆయన చిన్న కొడుకు సన్నీ ఉన్నారు.