భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ను సమర్పించడానికి చివరి తేదీ జనవరి 09.
ఖాళీలు: 119.
ట్రైనీ ఇంజినీర్ – I: ఎలక్ట్రానిక్స్ 65, కంప్యూటర్ సైన్స్ 06, మెకానికల్ 37, ఎలక్ట్రికల్ 08, కెమికల్ 01.
ట్రైనీ ఆఫీసర్- –I: ఫైనాన్స్ 02.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ బోర్డు నుంచి సంబంధిత రంగంలో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బి.టెక్./ బీఎస్సీ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి. కనీసం ఫస్ట్ క్లాస్ మార్కులతో ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 28 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: 2025, డిసెంబర్ 29.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.150.
లాస్ట్ డేట్: జనవరి 9.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్లిస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
కనీస అర్హత: జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి.
పూర్తి వివరాలకు bel-india.in వెబ్సైట్ను సందర్శించండి.
