డిప్యూటీ సీఎంగా కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క తన ఇంట్లో దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భట్టి విక్రమార్క వైఎస్ఆర్ కు వీరాభిమాని అని తెలిసిందే. వైఎస్ఆర్ ను రాజకీయ గురువుగా భావిస్తారు భట్టి.. తన పాదయాత్రలో కూడా ఆయన పూర్తిగా వైఎస్ఆర్ ను ఫాలో అయ్యారు. వైఎస్ పంచెకట్టుతో సహా హావభావాల వరకు అన్నీ ఫాలో అయ్యారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేస్తు్న్నారని తెలియడంతో ఆయన ఇంటికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్కకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య.