చేవెళ్లలో కాంగ్రెస్ గెలుపు సెంటిమెంట్  :  పామెన భీం భరత్

చేవెళ్లలో కాంగ్రెస్ గెలుపు సెంటిమెంట్  :  పామెన భీం భరత్

చేవెళ్ల, వెలుగు: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సెంటిమెంట్​ప్రాంతమైన చేవెళ్లలో కాంగ్రెస్​కు  ప్రజలు మరోసారి పట్టం కట్టాలని  ఆ పార్టీ చేవెళ్ల అభ్యర్థి పామెన భీం భరత్​ కోరారు. రాష్ట్రంలో చేవెళ్ల సెంటిమెంట్​తో  అమలు చేసిన ప్రతి పథకం విజయవంతమైందని గుర్తుచేశారు. ఇకముందు కూడా చేవెళ్ల సెంటిమెంట్​ను కొనసాగిద్దామని, అందుకు పార్టీని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పామెన భీం భరత్  ప్రచారం నిర్వహించారు. ముందుగా చేవెళ్ల మండలం తంగడ్​పల్లిలో ముస్లిం మైనార్టీ సోదరులు గ్రామ పార్టీ సీనియర్​నేత పాండు యాదవ్​ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి భీం భరత్​ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీ పథకాలు కచ్చితంగా అందిస్తామని ప్రజలకు భరోసాఇచ్చారు.  కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్లు దేవర వెంకట్​రెడ్డి,ప్రతాప్​రెడ్డి,పడాల రాములు, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్‌‌‌‌రెడ్డి, మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు రెడ్డిశెట్టి మధుసూదన్‌‌‌‌గుప్తా, మాజీ సర్పంచ్‌‌‌‌లు దవల్ గారి గోపాల్ రెడ్డి, పడాల ప్రభాకర్‌‌‌‌, నర్సింలు, మాజీ ఎంపీటీసీ నరసింహరెడ్డి, పెంటయ్య గౌడ్, చేవెళ్ల ఉప సర్పంచ్‌‌‌‌ గంగి యాదయ్య, మాజీ ఉప సర్పంచ్‌‌‌‌ టేకులపల్లి శ్రీనివాస్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.