హైదరాబాద్, వెలుగు: ఏఐ ఆధారిత ఫిన్టెక్ ప్లాట్ఫారమ్ జేయూఎంపీపీ (జంప్) తన యాప్ ద్వారా యూపీఐ పేమెంట్సేవలను ప్రవేశపెట్టింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) నుంచి థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్లైసెన్సు దక్కించుకుంది. సాధారణ ఫైనాన్స్ కంపెనీ నుంచి ఫుల్ స్టాక్ ఫైనాన్షియల్ సూపర్ యాప్గా మారామని తెలిపింది. యాప్ ద్వారా డబ్బు బదిలీలు, బిల్లు చెల్లింపులు, మొబైల్ రీచార్జ్లు చేసుకోవచ్చు. ఇప్పటికే డిజిటల్ గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, సిప్ సేవలు అందుబాటులో ఉన్నాయి.
