చెన్నూరులో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి 500 మంది కార్యకర్తలు

చెన్నూరులో బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి  500 మంది కార్యకర్తలు

చెన్నూరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.  భీమారం కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు చేకుర్తి సత్యనారాయణ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు వేల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

వీరిలో మాజీ జెడ్పీటీసీ రాజు నాయక్,ఐదుగురు మాజీ సర్పంచులు,మాజీ సింగిల్ విండో చైర్మన్ ,మాజీ ఉపసర్పంచ్ లు వార్డ్ మెంబర్లు తో పాటు 500 మంది బీఆర్ఎస్,బీజేపీ నుంచి నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.  

వీరికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీనియర్ నాయకులతో కలిసిమెలిసి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు ఎమ్మెల్యే వివేక్.