
టాలీవుడ్ నటి, బిగ్బాస్ ఫేం దివి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేడు శనివారం (జూన్ 21న) వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి దివి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం తీసుకుంది.
ఈ సందర్భంగా తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని దివి తెలిపింది. తెలుగుదనం కనిపించేలా పట్టు పరికిణిలో దివి ఆకట్టుకుంది. అక్కడున్న భక్తులు ఫోటోలు అడగగా.. వారికి దివి సెల్ఫీలు ఇచ్చింది, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో దివి తన దర్శనానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. స్వామివారిపై తనకున్న భక్తిని చెప్పుకొచ్చింది. "నాకెప్పుడు ఏ బాధ ఒచ్చినా, ఎక్కువ బాధ పడే టైం ఇవ్వకుండా.. తన దగ్గరకి పిలుచుకుంటాడు శ్రీ వేంకటేశ్వర స్వామి. స్వామిని చూసిన వెంటనే అన్నీ బాధలు, కష్టాలు అన్నీ మాయం అయిపోతాయి. నేను నటిని అయినా దగ్గర నుండి, ఇప్పటి వరకు ప్రతి కోరిక నేను ఇక్కడ తిరుపతిలో కోరుకున్నదే! ఎప్పటికీ కృతజ్ఞతలు. ఇంకొన్ని కోరికలు ఉన్నాయ్, జరిగే వరకు కోరికలు ఎవరికి చెప్పకూడదు అంటారని" తన ట్వీట్ లో రాసుకొచ్చింది.
దివి సినిమా కెరీర్:
కెరీర్ స్టార్టింగ్లో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన దివి, బిగ్బాస్తో ఒక్కసారిగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.
►ALSO READ | Hari Hara Veera Mallu: అఫీషియల్.. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం దివి సినిమాలు, వెబ్ సిరిస్ లలో నటిస్తూ బిజీగా ఉంది. ఏ 1 ఎక్స్ప్రెస్, గాడ్ ఫాదర్, లంబసింగి, హరికథ, డాకు మహారాజ్ వంటి సినిమాల్లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది.