సినీ ఫక్కీలో భారీ మోసం.. రూ.15 లక్షలకు టోకరా

సినీ ఫక్కీలో భారీ మోసం.. రూ.15 లక్షలకు టోకరా

హైదారాబాద్ లోని బంజారాహిల్స్‌లో సినీ ఫక్కీలో భారీ మోసం జరిగింది. స్వచ్ఛంద సంస్థకు రూ.10కోట్ల విరాళం ఇప్పిస్తామంటూ.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొంతమంది దుండగులు టోకరా వేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో రూం బుక్‌ చేసిన నిందితులు.. బాధితుడిని అక్కడికి పిలిపించుకున్నారు.

అతడికి మాయ మాటలు చెప్పి రూ.15లక్షల నగదుతో ఉడాయించారు. మోసపోయినట్లు గుర్తించిన ఆ వ్యక్తి వెంటనే బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల గురించి ఆరా తీస్తున్నారు. ఈ మేరకు హోటల్‌ సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.