రోడ్డు ప్రమాదం: కళ్లకు కట్టినట్లు రికార్డయిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు

రోడ్డు ప్రమాదం: కళ్లకు కట్టినట్లు రికార్డయిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు

హైదరాబాద్​ ట్యాంక్​బండ్​పై శనివారం తెల్లవారుజామున 3:40 నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగింది. రాణిగంజ్ వైపు నుంచి వస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ట్యాంక్‌బండ్‌పై బండి మలుపుకొని తిరిగి రాణిగంజ్ వైపు వెళ్లేందుకు రోడ్డు దాటడానికి ప్రయత్నించారు. అదే సమయంలో రాణిగంజ్ నుంచి లిబర్టీ వైపు వేగంగా వస్తున్నమరో ద్విచక్ర వాహనదారుడు వారి వాహనాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. గాయపడ్డ ముగ్గురు వ్యక్తులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గాంధీ నగర్ పోలీసులు తెలిపారు.