కార్యకర్తల మధ్య దామోదర్​ బర్త్​డే వేడుకలు

కార్యకర్తల మధ్య దామోదర్​ బర్త్​డే వేడుకలు

జోగిపేట, వెలుగు : ఇటీవల ఆందోల్​ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్​ నేత దామోదర్​రాజనర్సింహా మంగళవారం తన బర్త్​డే వేడుకలను కార్యకర్తల మధ్య జరుపుకున్నారు. అల్మాయిపేట సమీపంలోని ఓ  ఫంక్షన్​హాల్​లో జరిగిన వేడుకల్లో దామోదర్​తో పాటు ఆయన కూతురు త్రిషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.  

అందోల్ ప్రజలతో తమ కుటుంబానికి ఐదు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నట్లు గుర్తుచేశారు. అనంతరం యువజన కాంగ్రెస్​నాయకుడు జాకీర్​ఆధ్వర్యలో జోగిపేటలోని ప్రభుత్వ హాస్పిటల్​లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో డాకూరి వెంకటేశం, కౌన్సిలర్​శంకర్, నాయకులు ప్రవీణ్​, నాని, దిలీప్​, సరేందర్​గౌడ్​, అబ్బాస్​ పాల్గొన్నారు.