నిరుద్యోగుల కోసం బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష

నిరుద్యోగుల కోసం  బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష

హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర  నిరుద్యోగుల  సమస్యల పరిష్కారం కోసం బీజేపీ 24 గంటల నిరాహార దీక్ష చేపట్టింది.  బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అద్యక్షతన ఈ దీక్ష కొనసాగుతోంది.ఈ దీక్షలో  కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పలువురు బీజేపీ సీనియర్ నేతలు ,కార్యకర్తలు పాల్గొన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కలిపించి , నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. 

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను చేసిన దగాకు నిరసనగా 24 గంట దీక్ష చేపట్టామన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి.   ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను దగా చేసిందని విమర్శించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించి వెంటనే నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. G20 సమ్మిట్ ద్వారా ప్రధాని మోడీ మరిన్ని ఉద్యోగాలు తీసుకువచ్చేలా కృషి చేస్తున్నారని తెలిపారు.   తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక నిరుద్యోగం అనేది లేకుండా చేస్తామని తెలిపారు.