హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకులను మరింత సమన్వయం చేసుకునేందుకు వీలుగా బీజేపీ.. జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమించింది. ఆదిలాబాద్కు ఆదినాథ్, మంచిర్యాలకు అశోక్ వర్థన్, నిర్మల్కు మేడిసెమ్మె రాజు, కామారెడ్డికి భారత్, రంగారెడ్డి అర్బన్ కు గోవర్థన్ గౌడ్, సిద్ధిపేటకు నలగామ శ్రీనివాస్, నల్గొండకు యాదగిరి, నాగర్ కర్నూల్ కు కట్టా సుధాకర్ రెడ్డి, హన్మకొండకు పి. రాజేంద్ర ప్రసాద్, వరంగల్ కు గుడిపల్లి రాజేశ్వర్ రావు, జనగామకు శివరాజ్ యాదవ్, భద్రాద్రి కొత్తగూడెంకు వెంకట రంగా కిరణ్, భాగ్యనగర్..మలక్ పేట్ (ఇది బీజేపీ పరంగా ఒక జిల్లా ) జమలాపుర్ శంకర్ లను బుధవారం నియమించినట్లు పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు.