బీజేపీ రాష్ట్ర ఇంఛార్జిగా సునీల్ బన్సల్

బీజేపీ రాష్ట్ర ఇంఛార్జిగా సునీల్ బన్సల్

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బీజేపీ అధిష్టానం పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కీల నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ను మార్చింది. తరుణ్ చుగ్ స్థానంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సునీల్ రైట్ హ్యాండ్ గా వ్యవహరించే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.

జాతీయ కార్యదర్శిగా పదోన్నతి
సునీల్ బన్సల్ ప్రస్తుతం బీజేపీ ఉత్తర్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చారు. దీంతో పాటు తెలంగాణ, బెంగాల్, ఒడిశాలకు ఇంఛార్జ్గా నియమించారు. ఇప్పటి వరకు తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ గా తరుణ్ చుగ్ వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణలో పట్టు పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అధినాయకత్వం సునీల్ బన్సల్కు రాష్ట్ర బాధ్యతలు అప్పజెప్పినట్లు తెలుస్తోంది.

ఏబీవీపీ నుంచి ప్రస్థానం 
1969 సెప్టెంబర్ 20న రాజస్థాన్ లో జన్మించారు సునీల్. ఏబీవీపీ నాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రచారక్ గా వ్యవహరించారు. 2010 నుంచి 14 వరకు యూత్ ఎగైన్స్ట్ కరప్షన్ నేషనల్ కన్వీనర్ గా పనిచేశారు. 2014లో యూపీ ఎన్నికల కో ఇంఛార్జ్ గా పనిచేసిన ఆయన.. 2017లో ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పదోన్నతి పొందరు. 20-17లో ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీని గెలిపించిన వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది.