కేసీఆర్ కు గిన్నిస్ బుక్ లో చోటు ఇవ్వొచ్చు

కేసీఆర్ కు గిన్నిస్ బుక్ లో చోటు ఇవ్వొచ్చు

హైదరాబాద్: అబద్ధపు హామీలిచ్చి మాట తప్పడంలో కేసీఆర్ కు గిన్నిస్ బుక్ లో చోటు ఇవ్వొచ్చన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ RTC క్రాస్ రోడ్ లో జరిగిన BC విద్యావంతుల సదస్సు లో  కేంద్రమంత్రి శ్రీ పాదయశో, OBC మోర్చ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి  పాల్గొన్నారు. 50శాతం జనాభా ఉన్న బీసీలను కేసీఆర్ మోసం చేశారన్నారు. కొందరు బీసీ సంఘాల నేతలు పైసలకు అమ్ముడు పోయారని విమర్శించారు బండి సంజయ్.  2014 ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు . కార్యక్రమంలో OBC మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ ఇతర నేతలు పాల్గొన్నారు.