నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగు నీరు అందించాలి : కలెక్టర్ఇలా త్రిపాఠి

నిజామాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామానికి తాగు నీరు అందించాలి : కలెక్టర్ఇలా త్రిపాఠి

​ఎడపల్లి, వెలుగు: జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామానికి మిషన్​భగీరథ నీరు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్​కలెక్టర్​ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ఎడపల్లి మండలం జానకంపేట వద్ద ఏర్పాటు చేసిన వాటర్​బూస్టర్ సిస్టమ్ ను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. దీని పనితీరు, ప్రయోజనాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నివాస ప్రాంతాలకు సైతం మంచి నీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.