కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడుతాం

కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడుతాం

హైదరాబాద్: బీజేపీ కార్యకర్తలను నశం పెట్టి కొడుతామని కేసీఆర్ హెచ్చరిస్తారా..కేసీఆర్ నశం పెడితే మేము జండూబామ్ పెడుతామని కౌంటర్ ఇచ్చారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జనగామ సభలో సీఎం కేసీఆర్ బీజేపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ పై ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతదంన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న బండి సంజయ్.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని జనగామ సభ నుంచే అమలు చేస్తున్నానని భ్రమలో ఉన్నాడన్నారు. నోరు తెరిస్తే మందువాసన వచ్చే కేసీఆర్ ను పక్కాగా సభలోనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేపిస్తం అన్నారు. తాగినట్లు తేలితే... జైలుకు పంపుతామని.. ఆ స్కీం కేసఆర్ కోసం కచ్చితంగా తీసుకొస్తా అన్నారు.

సభ సందర్భంగా బీజేపీ కార్యకర్తలను దౌర్జన్యంగా అరెస్ట్ చేశారన్నారు. సీఎం సభకు రెండ్రోజుల ముందు నుండే కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్లో పెట్టారన్నారు.  పోలీసుల సమక్షంలో దాడులు చేయిస్తున్నరని.. బీజేపీ కార్యకర్తలు లాఠీలకు, దాడులకు భయపడకుండా బయటకొచ్చి భారతమాతాకీ జై అంటూ జెండా పట్టుకుని వస్తున్నారన్నారు. తెలంగాణలో పాలన ఇలాగే కొనసాగితే.... నిజాం పాలన మాదిరిగా కేసీఆర్ వస్తుంటే... చెప్పులు చేతుల్లో పట్టుకుని వంగి వంగి దండాలు పెట్టాలేమో? అన్నారు.

సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలని..డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి ఎంత మందికి ఇచ్చావో చెప్పాలన్నారు.  సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి కానీ..బీజేపీపై మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు అంటే కేసీఆర్ ఫ్యామీలికి గజగజ అన్నారు.