కౌన్సిల్ మీటింగ్ పెట్టండి

కౌన్సిల్ మీటింగ్ పెట్టండి
  •     మేయర్, కమిషనర్ కు బీజేపీ కార్పొరేటర్ల వినతి

హైదరాబాద్, వెలుగు :  బల్దియా కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని బీజేపీ కార్పొరేటర్లు కోరారు. గురువారం మేయర్ విజయ లక్ష్మి, కమిషనర్ రోనాల్ట్ రాస్ ని కలిసి వినతి పత్రం అందించారు.   సిటీలో  పెరిగిన సమస్యలపై చర్చించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  

ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్గొడుతున్న బడా వ్యాపారవేత్తలు, సినిమా హాల్స్ , షాపింగ్ మాల్స్, హోటల్స్ పైనా చర్యలు తీసుకోవాలని, అక్రమ పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్ ల్లో ఫైర్ సేఫ్టీ నార్మ్స్ పరిశీలించాలని, కల్తీ ఆహారంపై  నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.  సరూర్ నగర్, మల్కాజిగిరి, మూసాపేట  కార్పొరేటర్లు ఉన్నారు.