BHEL బస్ డిపోను తరలించడాన్ని నిరసిస్తూ బీజేపీ ధర్నా

BHEL బస్ డిపోను తరలించడాన్ని నిరసిస్తూ బీజేపీ ధర్నా

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండల పరిధిలోని బిహెచ్ఈఎల్ బస్ డిపోను తరలించొద్దని బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మహిళా నేత గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారి నుంచి బిహెచ్ఈఎల్ డిపో వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం డిపో మేనేజర్‭కు వినతిపత్రాన్ని అందజేశారు. 

గత 32ఏళ్లుగా ఉన్న బస్ డిపోను రంగారెడ్డి జిల్లా బస్సు డిపోగా మార్చొద్దని.. సిటీ సర్వీసులోనే ఉంచాలని బిజెపి రాష్ట్ర మహిళా నేత గోదావరిఅంజిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ కార్మికుల పొట్టగొట్టేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.