- మణిపూర్లో డబుల్ ఇంజిన్ ఫెయిల్
న్యూఢిల్లీ: బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో మణిపూర్ ప్రజలకు అనేక దెబ్బలు తగిలాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తూ సోమవారం ట్వీట్ చేశారు. “మణిపూర్లో హింస చెలరేగి 9 నెలలు అవుతోంది.
వేలాది మంది జీవితాలు నాశనమ య్యాయి.కానీ, ఆ రాష్ట్రంలో పర్యటించేందుకు మోదీకి ఒక గంట కూడా తీరిక దొరకట్లేదా? చివరిసారిగా 2022 ఫిబ్రవరిలో అదికూడా ఎన్నికల ప్రచారం కోసం మోదీ మణిపూర్లో పర్యటించారు. ఇప్పుడేమో మణిపూర్ ప్రజలను పట్టించుకోకుండా వదిలివేశారు” అని ఖర్గే విమర్శించారు.