నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు..దేశ చరిత్రలోనే ఇది నీచమైన స్కామ్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు..దేశ చరిత్రలోనే ఇది నీచమైన స్కామ్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో  సంచలన విషయాలు బయటకొస్తున్నాయి.   తన ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని   బీజేపీ  ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  తన  ఫోన్ ట్యాప్ అయినట్లు ఐజీ చెప్పారన్నారు.  ఎప్పుడు పిలిచినా వెళ్లి నా వాంగ్మూలం ఇస్తానని చెప్పారు.  ఫోన్ ట్యాపింగ్ దేశ చరిత్రలోనే అత్యంత నీచమైన స్కామ్ అని ఫైర్ అయ్యారు మహేశ్వర్ రెడ్డి. 

మరో వైపు ఇవాళ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో పోలీసులు ఆయనను ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు.

 2023 నవంబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు భారీగా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు దర్యాప్తు అధికారులు తేల్చిన సంగతి తెలిసిందే. 4013 ఫోన్ నంబర్లను మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అండ్ టీమ్ ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ఫోన్ ట్యాపింగ్ బాధితులు 618 మంది ఉండగా.. ఇందులో పొలిటికల్ లీడర్లు కూడా ఉన్నారు. 618 మందిలో అన్ని రాజకీయ  పార్టీల నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ , పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టులు కూడా ఉండటం గమనార్హం. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటెల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

త్వరలో  మైనంపల్లి హనుమంత రావు, మాజీ ఎమ్మెల్యే KS రత్నం , మర్రి శశిధర్ రెడ్డి, BRS నేతలు, మాజీ ఎమ్మెల్యే లు పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్ధన్ రెడ్డి, తాటి కొండ రాజయ్యలకు నోటీస్ ఇవ్వాలని సిట్ నిర్ణయించింది.