15 రాష్ట్రాలకు ఇంచార్జ్లను ప్రకటించిన బీజేపీ

15 రాష్ట్రాలకు ఇంచార్జ్లను ప్రకటించిన బీజేపీ

15 రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జ్లు, కో ఇంచార్జ్లను నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. బీజేపీ తెలంగాణ ఇంచార్జ్గా తరుణ్ చుగ్ను కొనసాగిస్తూనే..కో ఇంచార్జ్గా అరవింద్ మీనన్ను నియమించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ ప్రభుత్వం ఇంచార్జ్ నియామకంలో ఎలాంటి మార్పు చేయలేదు. 

మధ్యప్రదేశ్ ఇంచార్జ్గా మరళీధర్ రావు, కేరళ ఇంచార్జ్గా ప్రకాష్ జవదేకర్, రాజస్థాన్ ఇంచార్జ్గా అరుణ్ సింగ్, వెస్ట్ బెంగాల్ ఇంచార్జ్గా మంగళ్ పాండే, త్రిపుర ఇంచార్జ్గా మహేష్ శర్మ, బీహార్ ఇంచార్జ్గా వినోద్, హర్యానా ఇంచార్జ్గా బిప్లవ్ కుమార్, జార్ఖండ్ ఇంచార్జ్గా లక్ష్మీకాంత్ బాజ్పాయ్, పంజాబ్, ఛండీఘర్ ఇంచార్జ్గా విజయ్ భాయ్ రూపాని, లక్షదీప్ ఇంచార్జ్గా రాధామోహన్ అగర్వాల్ లను నియమిస్తూ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.