హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబం ధం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ఢిల్లీ లిక్కర్ స్కామ్.. రాష్ట్ర బీజేపీకి సంబంధం లేని విషయం. అది మా పరిధిలో లేదు. ఎవరికి నోటీసులు వస్తున్నాయి, ఎవరు అరెస్టు అవు తున్నారనేది మాకు అవసరం లేదు.. తెలంగాణలో జరుగుతున్న కుంభకోణాలపైనే మా పోరాటం.
ఇక్కడి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు ప్రజల భూములను కొల్లగొడుతున్నారు. ల్యాండ్, శాండ్, ధరణి కుంభకోణాలపై మా పోరాటం కొన సాగుతుంది. మూడు నెలల తర్వాత రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత భూకుంభకోణాలపై కచ్చితంగా దర్యాప్తు చేయిస్తాం’ అని కిషన్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో ఓ హోటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మజ్లిస్తో స్నేహం చేస్తున్న కేసీఆర్, బీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదన్నారు. బీజేపీపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.
చంద్రబాబుపై కక్ష సాధింపు కరెక్ట్ కాదు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్టుచేసేముందు మాట్లాడి ఉండాల్సిందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అక్కడి ప్రభుత్వం సంయమనం పాటించి ఉంటే బాగుండేదన్నారు. కక్ష సాధింపు చర్యలు సరికాదని ఆయన పేర్కొన్నారు.