మహిళా బిల్లు ఆమోదంపై సెప్టెంబర్ 23న బీజేపీ భారీ ర్యాలీ

మహిళా బిల్లు ఆమోదంపై సెప్టెంబర్ 23న బీజేపీ భారీ ర్యాలీ

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్​లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాసవడంతో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 23న గన్ పార్కు అమరవీరుల స్మారక స్థూపం నుంచి బీజేపీ స్టేట్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఇందులో మహిళలనే ఎక్కువగా భాగస్వాములను  చేయనున్నారు.

 రాష్ట్రానికి చెందిన ఐదుగురు బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులకు ఘనంగా స్వాగతం పలికేందుకూబీజేపీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ ఐదుగురు ఎంపీలు శనివారం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు.