ఆర్మూర్, వెలుగు: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను ఎప్పటికప్పుడు కాంటా వేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్జిల్లా ఆర్మూర్తహసీల్దార్ ఆఫీస్ముందు ధర్నా చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాంటి తరుగు లేకుండా వడ్లు తూకం వేయాలని, ఇప్పటివరకు తీసిన 8 నుంచి 12 కిలోల వడ్లు తరుగు మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేయాలని డిమాండ్చేశారు.
కేంద్రాల్లో లారీలను అందుబాటులో ఉంచి, సరిపోయే గన్నీ బ్యాగులను తెప్పించాలని, హమాలీల సమస్య పరిష్కరించాలని కోరారు. తహసీల్దార్కు మోమోరాండం అందజేశారు. మోర్చా టౌన్ ప్రెసిడెంట్శేషగిరి లింగం, బీజేవైఎం టౌన్ప్రెసిడెంట్ఉదయ్ గౌడ్, నాయకులు భాజన్న, కిరణ్, పోశెట్టి, భూపతి, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
