- శంషాబాద్ ఓఆర్ఆర్కి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు
- కల్వకుంట్ల కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలి: డీకే అరుణ
- కేసీఆర్ పాలనలో పేదల ఆశలు అడియాసలయ్యాయి: కిషన్రెడ్డి
- రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన
కల్వకుంట్ల కుటుంబ పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఏర్పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన ఢిల్లీ నుంచి శంషాబాద్ఎయిర్పోర్ట్కి చేరుకోగానే అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బాటసింగారం డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలనకు వెళ్లాలని బీజేపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేసీఆర్ గవర్నమెంట్నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తోంది. బాటసింగారానికి వెళ్లేందుకు తమని అనుమతించాలని కిషన్రెడ్డి పోలీసులను కోరారు. వారు నిరాకరించడంతో వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రఘునందన్ రావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే ఈటల రాజేందర్, సీనియర్ నేత డీకే అరుణ తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో శంషాబాద్ఓఆర్ఆర్దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్రావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. కేసీఆర్ కుటుంబం జైలులో గదులు రెడీ చేసుకోవాలని డీకే అరుణ ఎద్దేవా చేశారు.
ఇళ్ల పంపిణీలో ఆలస్యం ఎందుకు..
కేసీఆర్ ఉండటానికి 10 ఎకరాల్లో అందమైన భవనం కట్టుకుని పేదలకు ఇళ్ల పంపిణీలో తాత్సారం చేస్తున్నారని కిషన్రెడ్డి అన్నారు. పూర్తి చేసిన ఇళ్లను పంపిణీ చేయకుండా కేసీఆర్ కుటుంబం ఆలస్యం ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు. అయితే బాట సింగారం పోరుబాటకు పోలీసులు అనుమతి లేదంటున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.