రాజకీయాలకు అతీతంగా బీజేపీ సేవా కార్యక్రమాలు

రాజకీయాలకు అతీతంగా బీజేపీ సేవా కార్యక్రమాలు

బలహీనవర్గాల సంక్షేమానికి ప్రధాని మోడీ పెద్దపీట వేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ముషీరాబాద్ జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన నమో ఫొటో ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించారు. ప్రధాని దేశవ్యాప్తంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించినట్లు తెలిపారు. కేబినెట్లో బలహీన వర్గాలకు చెందిన 27మందికి మంత్రులుగా అవకాశం కల్పించిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు. 

ప్రధాని మోడీ మెడికల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించారని లక్ష్మణ్ తెలిపారు. రాజకీయాలకు అతీతంగా బీజేపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. మోడీ జీవిత చరిత్ర, అభివృద్ధి కార్యక్రమాలు అందరికి తెలిసేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 2న ఖాదీ మేళా పేరుతో  చేనేత కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.