జాబ్ కోసం కాకుండా జాబ్ క్రియేటర్స్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ప్రపంచం మొత్తం దేం వైపు చూస్తోందన్నారు. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరగనున్న సిటిజెన్ యూత్ పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్నారు లక్ష్మణ్.
ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్.. యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఓయూ స్టూడెంట్స్ నుంచే తాను రాజకీయాల్లో ఎదిగానని చెప్పారు. యువతతోనే రాజకీయాల్లో చైతన్యం వస్తుందన్నారు. తెలంగాణ అనేక మంది ఉద్యమకారులను తయారు చేసిందని.. ఉద్యమాలకుపెట్టింది పేరు తెలంగాణ అంటూ కొనియాడారు... రాష్ట్ర నిర్మాణం కోసం పార్లమెంటర్ గా యువత ఎదగాలని సూచించారు.
యువతతోనే దేశం బాగుపడుతుంది
యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు హోంమంత్రి మహమూద్ అలీ. యువతకు, యంగ్ లీడర్స్ కు సీఎం ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పారు. తెలంగాణలో చాలా మంది యూత్ ఎమ్మెల్యే లు ఉన్నారని.. చాలా మంచి సేవ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది యంగ్ ఐఏఎస్,ఏపీఎస్ లను చూస్తున్నామని తెలిపారు. యువతతో చైతన్యం వస్తుందని.. దేశం బాగుపడుతుందని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.