రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోంది : బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్

రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోంది : బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు : రిజర్వేషన్ల అమలులో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారికి దక్కాల్సిన రిజర్వేషన్ల ను కేసీఆర్ ముస్లింలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు దోచిపెట్టడంలో వైఎస్ఆర్​తో  కేసీఆర్ పోటీ పడ్తుతున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన పార్టీ  రాష్ట్ర కార్యాల యంలో మీడియాతో మాట్లాడారు.

బీసీ–ఈ పేరుతో ముస్లింలకు వైఎస్ 4% రిజర్వేషన్లు ఇవ్వటం అన్యాయమని లక్ష్మణ్ అన్నారు. వారికి జనాభా కంటే తక్కువ రిజర్వేషన్లు అమలవుతున్నాయని..లోకల్ బాడీల్లోనూ బీసీలకు తీవ్ర అన్యాయం జరుగు తోందని తెలిపారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు హిందువులు, బీసీలకు వ్యతిరేకం అని విమర్శించారు. దళితబంధులా బీసీబంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు.బీసీలకు కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కేంద్ర విద్యాలయాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మోడీ సర్కారుదేనని గుర్తుచేశారు.