హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. నాలుగో రౌండు ముగిసేసరికి బీజేపీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. నాలుగో రౌండ్లో ఈటలకు 562 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తంగా 4 రౌండ్ల తర్వాత 1,825 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. నాలుగో రౌండ్లో బీజేపీ 4,444.. టీఆర్ఎస్ 3,882.. కాంగ్రెస్ 234 ఓట్లు సాధించాయి. మొత్తంగా బీజేపీ 17,969.. టీఆర్ఎస్ 16,144.. కాంగ్రెస్ 680 ఓట్లు సాధించాయి.