పేరుకు మాత్రమే వైఎస్ జగన్ ఏపీకి సీఎం అని, ఆయన వెనక ఉండి నడిపించేది మొత్తం తెలంగాణ సీఎం కేసీఆరే అని ఆ రాష్ట్ర బీజేపీ లీడర్ బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో జరిగిన ఓ మీటింగ్ లో పాల్గొన్న బైరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… జగన్ పరిపాలనకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా కేసీఆర్ అని అన్నారు. ఆంధ్రుల అభిమానం దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు జగన్ కు గురువు అయ్యారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబుపై కోపంతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, ఆయన పాలనలో రాష్ట్రం నాలుగడుగులు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. కోతికి అద్దమిస్తే ఏంచేయాలో తెలియక నేలకేసి కొట్టినట్టుగా జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు బైరెడ్డి.