కూకట్పల్లిలో భారీగా బోగస్ ఓట్లు నమోదు: బీజేపీ నేత హరీష్ రెడ్డి

కూకట్పల్లిలో భారీగా బోగస్ ఓట్లు నమోదు: బీజేపీ నేత హరీష్ రెడ్డి

హైదరాబాద్​ : కూకట్ పల్లి నియోజకవర్గంలో భారీగా బోగస్ ఓట్లు నమోదయ్యాయని మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలోని కేపీహెచ్​ బీ డివిజన్ లో ‘బూత్, బూత్ కు భారతీయ జనతా పార్టీ’ కార్యక్రమంలో భాగంగా ఇవాళ బీజేపీ నేతలతో కలిసి పన్నాల హరీష్​ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గం వ్యాప్తంగా ప్రతి డివిజన్ లోనూ బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఓటరు నమోదు ప్రక్రియ, బోగస్ ఓట్ల గుర్తింపుపై ఆరా తీశారు.

ప్రతి బూత్ అధ్యక్షుడు ఇంటికి హరీష్ రెడ్డి బోర్డు ఏర్పాటు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని..ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాలని హరీష్ రెడ్డి సూచించారు. కూకట్ పల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా బీజేపీ జెండా ఎగిరే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావుతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.