
- బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్ స్టాండింగ్ ఉందని కూడా అనుకుంటుండ్రు
- ఇవాళ ఢిల్లీలో అధిష్టానానికి అదే వివరిస్తా
- నేను ప్రస్తుతానికి బీజేపీలోనే ఉన్నా
- బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని, ప్రజలు అదే కోరుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్ స్టాండింగ్ ఉందని అంతా అనుకుంటున్నారని అధిష్టానానికి కూడా అదే చెబుతానన్నారు. ఆ అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని, తాను ప్రస్తుతానికి బీజేపీలోనే ఉన్నానని అన్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. ఇవాళ మాజీ మంత్రి ఈటలతో కలిసి ఢిల్లీ బయల్దేరిన ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలను, తన సందేహాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరిస్తానని చెప్పారు.
ALSO READ:పవన్ తండ్రిగా ఆ బాలీవుడ్ స్టార్
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుందని, అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు. దానిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియానే ఎక్కువ చేసి చూపిస్తోందని చెప్పారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కొంచెం ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతోందని, మోదీ, అమిత్ షా తల్చుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.