బీజేపీ నేత లక్ష్మణ్​కు కరోనా

బీజేపీ నేత లక్ష్మణ్​కు కరోనా

హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్​ కరోనా బారిన పడ్డారు. సోమవారం ఆయన సికింద్రాబాద్​లోని యశోద ఆస్పత్రిలో జాయిన్​ అయ్యారు. రెండు, మూడు రోజులుగా ఆయన కొంత అస్వస్థతతో ఉండడంతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్​గా తేలింది. విషయం తెలుసుకున్న హిమాచల్​ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ,​ పలువురు బీజేపీ నేతలు ఆయన్ను ఫోన్​లో పరామర్శించారు. 

మాజీ మంత్రి గీతారెడ్డి దంపతులకు..
కంటోన్మెంట్​: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకురాలు డాక్టర్ గీతారెడ్డి, ఆమె భర్త రామచంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారికి జ్వరం రావడంతో సోమవారం టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది.  దీంతో వారిద్దరు ప్రస్తుతం హోం ఐసోలేషన్​లో ఉన్నారు.