
- బీజేపి నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపణ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలుగా ఫెయిలైందని బీజేపీ కర్నాటక, తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. దక్షిణాదిలో రాబోయే రోజుల్లో ఎన్డీఏ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
సంస్థాగత విషయాలపై పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎస్ సంతోష్ తో భేటీ అయినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల కార్యవర్గాల పూర్తిపై చర్చ జరిగిందని చెప్పారు. జూన్ 25కి ఎమర్జెన్సీ డే 50ఏండ్లు పూర్తి కానుండటంతో బుధవారం బ్లాక్ చాప్టర్ ఆఫ్ ఎమర్జెన్సీ పేరుతో దేశవ్యాప్తంగా ప్రోగామ్ లు చేపట్టనున్నట్టు వెల్లడించారు.