రాజ్యాంగానికి, గవర్నర్కు సీఎం కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. కేసీఆర్ తొందరగా వీఆర్ఎస్ తీసుకోని వెళ్లిపోతే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రికి మహిళలంటే చిన్నచూపన్న విజయశాంతి .. కేసీఆర్ పాలనలో మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ పని అయిపోయిందని, ఆయన రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని అన్నారు. బీజేపీలోకి చేరికలు మరింత పెరుగుతాయని విజయశాంతి చెప్పారు.