రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోంది

రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోంది

మహబూబాబాద్ : రైతు సమస్యల పరిష్కారం విషయంలో కేసీఆర్ సర్కారు విఫమైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని అన్నారు. ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మహబూబాబాద్ లో నిర్వహించిన పార్టీ శిక్షణ తరగతులకు హాజరైన వివేక్ రాష్ట్ర సర్కారు వైఖరిని తూర్పారబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులను వాడుకుంటున్న కేసీఆర్ సర్కారు.. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు. సీఎం కేసీఆర్ తన కుటుంబానికి 5 పదవులు తెచ్చుకోవడం మినహా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని వివేక్ మండిపడ్డారు. తెలంగాణలో 5వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని ముందుచూపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో మాదిరిగానే థర్డ్ ఫ్రంట్ తుస్సుమంటుందని జోస్యం చెప్పిన వివేక్.. 2023లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

For more news:

దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ

కోహ్లీ, రోహిత్ వివాదం: ఏం జరుగుతుందో బీసీసీఐ చెప్పాలె

టిప్ విషయంలో యువకులకు వెయిటర్ కి గొడవ