బాప్ ఏక్ నంబర్.. బేటీ దస్ నంబర్: ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లాం

బాప్ ఏక్ నంబర్.. బేటీ దస్ నంబర్: ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లాం
  • సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత జాఫర్ ఇస్లాం ఫైర్​

హైదరాబాద్, వెలుగు: ‘‘బాప్ ఏక్ నంబర్.. భేటీ దస్ నంబర్’’లా సీఎం కేసీఆర్, ఆయన బిడ్డ కవిత తీరు ఉందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లాం విమర్శించారు. కవిత లిక్కర్ స్కామ్​ ఢిల్లీ వరకు పాకిందని, ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, కర్నాటకలో డీఎంకే నేతలు ప్రభుత్వ పథకాల్లో కమీషన్ దండుకుంటున్నారని ఆరోపించారు. గురువారం పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో  ఆయన మాట్లాడారు. 

ఢిల్లీలో జరగనున్న జీ20 సదస్సుతో ప్రపంచం దృష్టి భారత్​పై పడింది. సమిట్​కు వచ్చే ఇతర దేశాల ప్రతినిధుల ముందు మన దేశాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు. గ్లోబల్ లీడర్​గా అవతరించిన మోదీని ఆడిపోసుకుంటున్నారు’’ అని ఆయన ఫైర్​ అయ్యారు. దేశంలో కొందరు సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో అన్ని మతాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదని పేర్కొన్నారు. కానీ, నేడు ప్రతిపక్షాలు ధర్మాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేస్తూ విషప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. డెంగీ, మలేరియాతో పోలుస్తూ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.