హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ‘మేరా బూత్...సబ్ సే మజ్బూత్ ’ ప్రోగ్రాంను ఆసక్తిగా చూశారు. తెలంగాణ వ్యాప్తంగా మండల, జిల్లా స్థాయిలో పార్టీ క్యాడర్ కోసం పెద్ద స్క్రీన్ లు, టెలివి జన్ లను నేతలు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో మంగ ళవారం ఉదయం ప్రధాని మోదీ బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశిం చి చేసిన ప్రసంగాన్ని బీజేపీ క్యాడర్ ఆసక్తిగా చూసింది.
కేసీఆర్ పై ప్రధా ని మోదీ ఘాటైన విమర్శలు చేయ డంతో వర్చువల్ గా ఇందులో పాల్గొ న్న తెలంగాణ బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చింది. బీజేపీ స్టేట్ ఆఫీ సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేం దర్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు ఈ ప్రోగ్రామ్ లోపాల్గొన్నారు.